Tuesday, September 8, 2015

प्रजानामेव भुत्यर्ध्यं ताभ्यो बलिमग्रहीत।
सहस्र गुण मत्स्रुष्टुमादत्तेहि रसं रविः।।

ప్రజానామేవ భుత్యర్ధం స తాభ్యో బలిమగ్రహీత్
సహస్ర గుణ మత్స్రుష్టుమాదత్తేహి రసం రవిః

ప్రజావృద్ధి కార్యములకోసమే దిలీపుడు  ప్రజల వద్దనుండి బలిమగ్రహీత్  అంటే పన్ను (1/6 వంతు) వసూలు చేసేవాడు. సూర్యుడు తిరిగి వేయిరెట్లుగా వర్షించటానికే కదా నదీ సాగరాలనుంచి రసం అంటే నీటిని ఆవిరి గా మార్చి గ్రహించేది.

ఇది మహాకవి కాళిదాసు రఘు వంశం కావ్యం లోనిది. ఇక్కడ రాజు పన్ను ఎంత వసూలు చేయాలో కూడా చెప్పారు. మన నిత్యజీవితంలో అవసరాలకు కమ్మరి కుమ్మరి చాకలి వడ్రంగి మొదలైన వారితో అక్కడే క్రయవిక్రయాలు నిర్వహణ జరిగిపోతుంది. బ్రాహ్మణులు, సైనికులు  వారి అవసరాలకు క్రయవిక్రయాలు చేయలేరు చేయకూడదు. అటువంటి వారి సుఖసంతోషాలు  రాజు బాధ్యత. అదే కాక రాహదారుల నిర్వహణ మొదలైన అంశాలన్నీ ఈ పన్నులోనుంచే వినియోగించాలి. ఇప్పటి పన్ను విధానాలు మారిపోయాయి తమ జేబులు నింపుకోవటం కోసం పన్ను వసూలు ధర్మ మార్గం కాదు.

No comments:

Post a Comment