Wednesday, September 2, 2015

इंद्रियीर्धाननुभवन् बुद्धिमान लोकपूजितः
सम्मतः  सर्वभूतानामुच्छस्वन् को न जीवति

देवतातिथिभृत्यानां पितृणामात्मनश्चयः
न निर्वपति  पंचानामुच्छस्वन् न सजीवति

ఇంద్రియార్ధాననుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః
సమ్మతః  సర్వభూతానాంముచ్ఛ్వసన్ కో న జీవతి

దేవతాతిథిభృత్యానాం  పిత్రూణామాత్మనశ్చ యః
న నిర్వపతి పంచానాముచ్ఛ్వసన్ న స జీవతి


ఇది మహాభారతంలో యక్ష ప్రశ్నలు ఘట్టం లోనిది. యక్షుడు ధర్మరాజుని ఇలా అడిగాడు
ఎవరు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ, బుద్ధిమంతుడు, లోక పూజితిడు సర్వభూతాలకూ సమ్మతమైన వాడూ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు  సాగిస్తున్నా జీవచ్ఛవంతో సమానము??
దానికి ధర్మజుడు  ఇలా అన్నాడు
ఎవరైతే దేవతలకు, అతిథులకు, భృత్యులకు  అంటే పనివారు, పితృదేవతలకు  చివరగా ఆత్మనః అంటే స్వార్ధం ఈ అయిదుగురికీ తగినట్లుగా ఉపచారాలు చేయడో వారి బాగోగులు చూసుకోడో వాడు బ్రతికివున్నా మరణించినట్లు...

No comments:

Post a Comment