Wednesday, October 14, 2015

''గోభిస్తుల్యం నపశ్యామి ధనంకించిదిహాచ్యుత''

''కోడి, మేక లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....

గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ, నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది. తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా..


  1. ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని,
    ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.

    అలా ఒకరోజు, రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.

    ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ, మూత్రంలోగానీ, పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.

    మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
    గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
  2. "మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది".
    • ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు (Oxygen ) ను వదిలే ఏకైక ప్రాణి.
    • విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
    • వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
    • ఆవునెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
      • కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
    • గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
    • గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
    • ఇళ్ళను, వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
    • ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
    • ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen ) ఉత్పత్తి అవుతుంది.
    • గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
  3. ''గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మము రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''. - గాంధీజీ.
  4. ''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది. దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''. - మహ్మద్ ప్రవక్త.
  5. ''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''. - ఏసుక్రీస్తు.
  6. ''గో క్షీరము గొప్పమందు. దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని. దాని మాంసము రోగకారకము''. - హజరత్ మహమ్మద్.
  7. ''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము. ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపు భూములు గొప్పగానుండును. గృహములు ఉన్నతి చెందును. నాగరికత పురోగమించును''. - బర్మార్డ్ మేక్ ఫెడన్.
  8. ''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''. - హకీల హజ్మల్ ఖాన్.
  9. ''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''. - తోహస్-వి-హింద్ బిజహరు.
"భిన్నత్వంలో ఏకత్వం" ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?

నువ్వు హిందువైనా, మస్లీమువైనా, క్రిస్టియన్వైనా  ఈ దేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.

ఈ  దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.

స్వేచ్ఛంటే.... ''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు, ఈ  నీ  దేశం మెచ్చేటట్టు బ్రతకడం''

''వందేగోమాతరం''

No comments:

Post a Comment